Showing posts with label మహిళలకు యోగ శిక్షణ ప్రారంభం. Show all posts
Showing posts with label మహిళలకు యోగ శిక్షణ ప్రారంభం. Show all posts

Wednesday, 17 February 2021

తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లో మహిళలకు యోగ శిక్షణ ప్రారంభం

        ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు తెలిపారు .   తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ మధ్య గేటులో , మొదటి అంతస్తులో , 3 వ నెంబరు నందు ( జ్యోతి ఫోటో స్టూడియో పైన ) ఈనెల 16 వ తేదీ నుండి మహిళలకు యోగా శిక్షణా తరగతులు ప్రారంభమైనవని ఆయన తెలిపారు . యోగ శిక్షణా తరగతులు  ఆయుర్వేద డాక్టరు యామిని దివాకర్ గారిచే నిర్వహింపబడుతున్నవి ,  కావున మహిళలు సంపూర్ణ ఆరోగ్యానికి ప్రశాంత మానసిక స్థితి పొందుట కొరకు యోగా నేర్చుకోగలరని తెలిపారు . ప్రారంభోత్సవానికి రెడ్ క్రాస్ చైర్మన్ డి.వెంకటేశ్వర్లు , రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వి ప్రసాద్ , కమిటి సభ్యులు యన్.యస్. రవి , రత్న శేఖర్ , డాక్టర్ రవి , ఏ డి య ప్ ఓ.  పి  నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు .  మరిన్ని వివరములకు రెడ్ క్రాస్ చైర్మన్  డి వెంకటేశ్వర్లు   9885002421 నెంబరుకు సంప్రదించగలరు .       

        యోగా - ఆసనములు  అనే రెండు పదాలను కలిపి యోగాసనములు అనేవారు . కాలానుగుణంగా ఆసనములు మరచిపోయి , యోగా మాత్రమే వాడుకభాష లో ఉపయోగించుచున్నారు . యోగః  చిత్తవృత్తి  నిరోధః  అనగా యోగా చేయడంవలన మనస్సు నిగ్రహపరచుకోవచ్చు . యోగా అనగా ప్రాణాయామం ద్వారా ఉఛ్వాస నిస్వాసలను అదుపు చేసి మనస్సును ఏకాగ్రత పరచవచ్చును . తద్వారా జ్ఞాపకశక్తి , ఆరోగ్యము ,  అతీన్ద్రియ శక్తులను సాధించవచ్చునని పతంజలి మహర్షి తన యోగసూత్రాల ద్వారా తెలియచేశారు .ఇప్పుడు యోగా అనగా ఆసనములు , ప్రాణాయామము , ధ్యానము నేర్పించడం జరుగుతున్నది . సైన్సు ఎంత అభివృద్ధి చెందినా మనిషి మానసిక ప్రశాంతత కొరకు , ఆరోగ్యము కొరకు యోగ మార్గమును ఆచరించ వలసిందే .












           

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...