Showing posts with label మీ ఇంట్లోనే గొంతు ఊపిరి తిత్తుల్లోని కఫాన్ని తగ్గించుకోండి. Show all posts
Showing posts with label మీ ఇంట్లోనే గొంతు ఊపిరి తిత్తుల్లోని కఫాన్ని తగ్గించుకోండి. Show all posts

Thursday 29 April 2021

మీ ఇంట్లోనే గొంతు ఊపిరి తిత్తుల్లోని కఫాన్ని తగ్గించుకోండి


             త్రిదోషాలలో ఒకటైన కఫ దోషం కలగడంవల్ల  , కొంతమంది వేరే ప్రదేశం మారినా , నీళ్ళు మారినా జలుబు చేసినట్లు ఉండడం , గొంతులో మరియు ఛాతీలో అనగా ఊపిరితిత్తుల్లో గల్ల పేరుకు పోయి , విపరీతమైన దగ్గు రావడం, ఊపిరి ఆడడంలో ఇబ్బంది కలుగుతుంది . ఇలాంటి సందర్భాల్లో మన వంట ఇంట్లోనే లభించే మజ్జిగ మరియు వాము తో ఈ కఫాన్ని దగ్గును తగ్గించుకోవచ్చును . ముందుగా వామును పొడి చేసుకొని , అర చెంచా వాము పొడిని గ్లాసు పలుచటి మజ్జిగలొ కలుపుకొని పరగడపునగానీ సాయంత్రం 6 గంటల సమయంలో గాని రోజుకొకసారి త్రాగినా కఫం నుండి ఉపశమనం పొందవచ్చును . ఒకవేళ  మజ్జిగ పడనీ వారు , మజ్జిగ అందుబాటులో లేనప్పుడు గ్లాసు మంచి నీళ్లలో అరస్పూను వామును లేదా వాము పొడిని  కలిపి పొయ్యి మీద కాచి వడగట్టి గోరువెచ్చగా అయినా తర్వాత తాగిన ఎడల కఫాన్ని తగ్గించుకోవచ్చును .   ప్రస్తుత కరోనా పరిస్థితిలో ,  గొంతులో , ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి , శ్వాస తీసుకోవడానికి  ఇబ్బంది పెడుతున్న కఫాన్ని తగ్గించుకోడానికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది . ఈ చిట్కాను ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రదీప్ వానపల్లి తెలియచేశారు , వారికి జొమాటో న్యూస్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నాము . 



శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...