ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలను జరుపుకోనున్న సందర్భంగా అన్ని జిల్లాలలో సైకిల్ ర్యాలీని నిర్వహించమని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సూచించిందని , తిరుపతి శాఖ చైర్మన్ డి వెంకటేశ్వర్లు తెలిపారు . ఈ సందర్భంగా తిరుపతి డివిజన్ శాఖ వారు ఈనెల 20 వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి కాంప్లెక్స్ రెడ్ క్రాస్ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారు . ఈ ర్యాలీ శ్రీదేవి కాంప్లెక్స్ నుండి బయలు దేరి తిలక్ రోడ్ , ఈస్ట్ పోలీసు స్టేషన్ , టి.వి.యస్ సర్కిల్ , వెస్ట్ చర్చి , శ్రీ జ్యోతీ రావు పూలే విగ్రహం , టౌన్ క్లబ్ , రూయా ఆసుపత్రి , ఇస్కాన్ టెంపుల్ , అన్నమయ్య సర్కిల్ , వివి మహల్ రోడ్డు , మునిసిపల్ కార్యాలయం మీదుగా శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ర్యాలీ పూర్తవుతుందని , ర్యాలీలో రెడ్ క్రాస్ సభ్యులు మరియు విద్యార్ధులు పాల్గొననున్నారని సంస్థ తిరుపతి శాఖ అద్యక్షులు వి కనకనరసింహా రెడ్డి తెలిపారు . మరిన్ని వివరములకు రెడ్ క్రాస్ తిరుపతి డివిజన్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు ను సంప్రదించగలరు మొబైల్ 9885002421 .
Showing posts with label రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలు. Show all posts
Showing posts with label రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలు. Show all posts
Subscribe to:
Posts (Atom)
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,, 6-1- 2023 తేదీన అనేకమంది న...

-
మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ...
-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర...
-
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొర...