Showing posts with label రెడ్ క్రాస్ సైకిల్ ర్యాలీ తిరుపతి. Show all posts
Showing posts with label రెడ్ క్రాస్ సైకిల్ ర్యాలీ తిరుపతి. Show all posts

Saturday, 20 March 2021

రెడ్ క్రాస్ సైకిల్ ర్యాలీ తిరుపతి

                 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శతజయంతి సందర్భంగా  , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ 20 వ తేదీ శనివారం ఉదయం  సైకిల్ ర్యాలీ నిర్వహించారు . తిరుపతి ఆర్ డి ఓ మరియు ఐ ఆర్ సి ఎస్ డివిజన్ శాఖ అధ్యక్షులు వి కనకనరసా రెడ్డి జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు . తిలక్ రోడ్డు లోని ఐ ఆర్ సి ఎస్ ఆఫీస్ నుండి  ప్రారంభించారు .   కార్యక్రమంలో కోవిడ్ సమయంలో రక్త దాన శిబిరాలు , ప్రాధమిక చికిత్స అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఐ ఆర్ సి య స్ తిరుపతి డివిజన్ శాఖ వారిని కనకనరసా రెడ్డి అభినందించారు . డివిజన్ శాఖ చైర్మన్ ఆచార్య  డి వెంకటేశ్వర్లు ర్యాలీలో పాల్గొన్న సైకిలిస్టులకు సూచనలు సలహాలు ఇస్తూ భవిష్యత్ కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని కోరారు . ఐ ఆర్ సి ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ వి ప్రసాద్ ఐ ఆర్ సి యస్ శత జయంతి గురించి వివరించారు .  శాఖ కార్యదర్శి జి వి  సుబ్బారావు ఆర్డిఓ మరియు ర్యాలీలో పాల్గొన్న సైకిలిస్టులకు కృతజ్ఞతలు తెలియజేశారు .  సైకిల్ ర్యాలీ లో , వీ రైడర్స్ క్లబ్  , యస్ వి వెటర్నిటీ యూనివర్సిటి ,  ఎస్ వి ఆర్ట్స్ కాలేజీ మరియు సెవెన్ హిల్స్ స్కూల్ నుండి దాదాపు 60 మంది  విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు .  తిరుపతి పట్టణం లోని వివిధ ప్రాంతాలలో  దాదాపు పది కిలోమీటర్లు వరకు ర్యాలీని నిర్వహించారు . ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శత జయంతి  సైకిల్ ర్యాలీలో  కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి , రత్నశేఖర్ ,  రవి , డాక్టర్ ప్రతీత్  , డి యఫ్ ఓ చిరంజీవి , ఏ డి యఫ్ ఓ నంద కిషోర్ పాల్గొన్నారు . 



శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...